నిర్లక్ష్యం, అజాగ్రత్త, ట్రాఫిక్ రూల్స్ ను ఉల్లంఘించడం వంటి కారణాలతో రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నారు పలువురు వాహనదారులు. ఈ ప్రమాదాల్లో ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకుంటుండగా.. చాలా మంది తీవ్ర గాయాలపాలై వైకల్యాన్ని ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ లోక్సభలో రోడ్డు భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో జరిగే చాలా రోడ్డు ప్రమాదాలు ప్రజల ప్రవర్తన, భద్రతా నియమాలను పట్టించుకోకపోవడం వల్లే జరుగుతున్నాయని తెలిపారు. ప్రశ్నోత్తరాల…