OBC Row: రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్రమోడీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. పీఎం మోడీ వెనకబడిన వర్గాల్లో(ఓబీసీ)లో పట్టలేదని గురువారం రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఒడిశాలో జరుగుతున్న ‘భారత్ జోడో న్యాయ యాత్ర’లో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ప్రధాని తనను తాను ఓబీసీగా చెప్పుకుంటూ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. గుజరాత్లో బీజేపీ ప్రభుత్వ హయాంలో ఓబీసీల్లో చేర్చిన ‘ఘంచీ’ కులానికి చెందిన కుటుంబంలో ఆయన ప్రధాని మోడీ జన్మించారని అన్నారు.