స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తదుపరి ఛైర్మన్గా చల్లా శ్రీనివాసులు శెట్టి నియమితులయ్యారు. ఈ మేరకు ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇనిస్టిట్యూషన్స్ బ్యూరో శనివారం ఎంపిక చేసింది. శెట్టి ప్రస్తుతం ఎస్బీఐ మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నారు. అంతర్జాతీయ బ్యాంకింగ్, గ్లోబల్ మార్కెట్లు, టెక్నాలజీ వర్టికల్స్ను ఆయన చూస్తుంటారు.