ప్రభుత్వం పంపుతున్న ఆహార ధాన్యాల్లో మూడో వంతు పేదలకు చేరడం లేదు. భారత ఆహార సంస్థ, రాష్ట్ర ప్రభుత్వాలు సరఫరా చేస్తున్న 28 శాతం ధాన్యాలు అనుకున్న లబ్ధిదారులకు చేరడం లేదని ఎకనామిక్ థింక్ ట్యాంక్ విడుదల చేసిన రిపోర్ట్లో వెల్లడైంది. దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు రూ.69,000 కోట్లకు పైగా ఆర్థిక నష్టం వాటిల్లుతుందని అంచనా. అలాగే.. ఈ వ్యవస్థను తక్షణమే మెరుగుపరచాలనే డిమాండ్ కూడా ఉంది.