విశాఖలో మరోమారు మత్స్యకారుల మధ్య వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. రింగు వలల వివాదంతో నగరంలో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. పోలీసులు అదుపులోకి తీసుకున్న తమవారిని విడిచిపెట్టాలని మత్స్యకారులు డిమాండ్ చేశారు. రోడ్డుపైకి వేల సంఖ్యలో గ్రామస్తులు వచ్చారు. రోడ్డుపై బైఠాయించారు. మంత్రులు, అధికారులతో చర్చలు బాయ్కాట్ చేస్తున్నామని మత్స్యకార నాయకులు తెలిపారు. మత్స్యకారులు కలెక్టరేట్ ముట్టడికి ర్యాలీగా బయలు దేరగా అక్కడ మంత్రులు అప్పలరాజు, అవంతి వారితో చర్చలు జరిపారు. పోలీసులు అదుపులోకి తీసుకున్నవారిని విడిచిపెట్టే వరకు…