తెలంగాణ మాజీ స్పీకర్ తాజాగా ఎమ్మెల్సీ పదవిని దక్కించుకున్నారు. గవర్నర్ కోటాలో నామినేటెడ్ ఎమ్మెల్సీగా మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారిని ఎంపిక చేస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా మధుసూదనచారి పేరును ప్రతిపాదిస్తూ రాజ్భవన్కు ఫైలును పంపించగా… గవర్నర్ తమిళిసై ఆమోదం తెలిపారు. ఈ నేపథ్యంలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీకి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ను మంగళవారం ఉదయం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. Read Also: పంతం నెగ్గించుకున్న కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి…