చార్లీ కిర్క్.. ట్రంప్ సన్నిహితుడు. ఇటీవల దుండగుడు జరిపిన కాల్పుల్లో చార్లీ కిర్క్ ప్రాణాలు కోల్పోయారు. దీంతో చార్లీ కిర్క్ సతీమణి ఎరికా కిర్క్ వెలుగులోకి వచ్చింది. ఇక మరణానంతరం చార్లీ కిర్క్కు దేశ అత్యున్నత పురస్కారం ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడం ప్రకటించింది.
తన భర్త వదిలిపెట్టి వెళ్లిన వారసత్వాన్ని కొనసాగిస్తానని చార్లీ కిర్క్ భార్య ఎరికా కిర్క్ ప్రకటించారు. బుధవారం ఉతా వ్యాలీ యూనివర్సిటీలో చార్లీ కిర్క్ ప్రసంగిస్తుండగా దుండగుడు జరిపిన కాల్పుల్లో మృతిచెందాడు. చార్లీ కిర్క్ ట్రంప్కు అత్యంత సన్నిహితుడు. గతేడాది జరిగిన ఎన్నికల్లో ట్రంప్ గెలుపునకు విశేష కృషి చేశాడు.