మరో మూడు కేసుల్లో రాజా సింగ్ను కోర్టు నిర్దోషిగా తేల్చింది. గతంలో విద్వేషపూరిత ప్రసంగం, ఎన్నికల ర్యాలీ, శ్రీరామ నవమి ర్యాలీ అనుమతి ఉల్లంఘనకు సంబంధించిన మూడు కేసులు నమోదయ్యాయి. ఈ కేసులను విచారించిన నాంపల్లిలోని ప్రత్యేక కోర్టు బీజేపీ శాసనసభ్యుడు టి. రాజా సింగ్ను నిర్దోషిగా ప్రకటించింది. మంగళ్హాట్, షాహినాయత్గంజ్ పోలీస్ స్టేషన్లలో ఈ కేసులు నమోదయ్యాయి.