తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఈ నగరానికి ఏమైంది’ తెలుగు యువతను ఎంతగానో ఆకట్టుకున్న కల్ట్ క్లాసిక్ చిత్రంగా నిలిచింది. ‘పెళ్లి చూపులు’ తర్వాత తరుణ్ భాస్కర్ నలుగురు స్నేహితుల జీవిత అనుభవాలతో ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమాకు సీక్వెల్గా ‘ENE రిపీట్’ రాబోతోందని ఈ సంవత్సరం ప్రారంభంలోనే అధికారిక ప్రకటన వెలువడింది. ఇందులో కూడా విశ్వక్ సేన్, సాయి సుశాంత్ రెడ్డి, అభినవ్ గోమటం, వెంకటేష్ కాకుమాను ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. Also Read:Exclusive…
‘పెళ్ళిచూపులు’ సినిమాతో టాలీవుడ్ల్లో సెన్సేషన్ క్రియేట్ చేసి, ట్రెండ్ సెట్ చేసిన దర్శకుడు తరుణ్ భాస్కర్. తన రెండో చిత్రం ‘ఈ నగరానికి ఏమైంది’ థియేటర్లలో అనుకున్నంతగా ఆడినప్పటికి.. ఓటీటీలో, టీవీలో ఈ సినిమాను జనం బాగానే చూశారు. కాల క్రమంలో దానికి కల్ట్ స్టేటస్ వచ్చింది. గత ఏడాది ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేస్తే తెలుగు ప్రేక్షకులు ఎగబడి చూశారు. థియేటర్లలో సెలబ్రేషన్స్ చూసి అందరూ షాకయ్యారు. విశ్వక్ సేన్, సాయి సుశాంత్ రెడ్డి,…