హీరా గ్రూప్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ చైర్ పర్సన్ నౌహెరాషేక్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులకు చుక్కలు చూపిస్తోంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లో కేసు నమోదైందంటేనే ఎంతో మంది వ్యాపారవేత్తలు భయపడిపోతారు. కానీ నౌహెరా షేక్ మాత్రం.. ఈడీ అధికారులతో చెలగాటం ఆడుతోంది. కోర్టు ఆదేశాల ప్రకారం, అటాచ్ చేసిన ఆస్తులను వేలం వేయడానికి ప్రయత్నిస్తే.. వేలంలో వేసిన వారినే బెదిరింపులకు దిగుతోంది. అంతే కాదు ఈడీ అటాచ్ చేసిన ఆస్తుల్లో కొన్నిటిని, అధికారులకే తెలియకుండా విక్రయిస్తోంది. Also Read:Premanand Maharaj:…
మాజీ మంత్రి తలసాని ఓఎస్డీ కళ్యాణ్ ఇంట్లో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. కళ్యాణ్ ఇంట్లో భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు.. నగదు లెక్కింపు మెషిన్లు తీసుకెళ్లిన ఈడీ అధికారులు లెక్కింపు చేపడుతున్నారు.. నగదుతో పాటు పలు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. తాజాగా మాజీ మంత్రి తలసాని ఓఎస్డీ కళ్యాణ్ ఈడీ అదుపులోకి తీసుకుంది. కళ్యాణ్ ఇంట్లో సోదాలు అనంతరం నేరుగా ఈడీ కార్యాలయానికి తీసుకొచ్చారు. పశుసంవర్థక శాఖ మాజీ డైరెక్టర్ రామచందర్ నాయక్, కాంట్రాక్టర్ మొయినుద్దీన్ తోకలిసి…