ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ ప్లేయర్ పృథ్వీ షా గురించి తెలియని వారుండరు. క్రీజులో ఉన్నంతసేపు ఫోర్లు, సిక్స్ లతో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడుతాడు. అలాంటిది.. తాజాగా జరుగుతున్న ఐపీఎల్ సీజన్ లో అతను మ్యాచ్ ల్లో కనపడటం లేదు. కేవలం డగౌట్ కే పరిమితమయ్యాడు. అతని స్థానంలో ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన యువ ఆటగాడు రికీ భుయ్ కు అవకాశం కల్పించారు.
సూర్య డగౌట్ లో కూర్చుని ఏదో తింటున్న వీడియో సోషల్ మీడియాలో చాలా తొందరగా వైరల్ అయ్యింది. ఆ వీడియోపై ఓ అభిమాని స్పందిస్తూ కామెంట్ చేశాడు. “సార్, మీరు డగౌట్లో కూర్చుని ఏమి తింటున్నారు, గ్రౌండ్కి వెళ్లి సిక్స్లు కొట్టండి” అని రాశాడు. అయితే దానికి సూర్యకుమార్ యాదవ్ చెప్పిన సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. “నేనేమీ తింటే మీకేందుకు.. మీకు కావాలంటే దయచేసి స్విగ్గీకి ఆర్డర్ ఇవ్వండి బ్రదర్” అని రాశాడు