బకాయిలు చెల్లించలేదని ఓ కాంట్రాక్టర్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకుంది. కర్ణాటక రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లిమిటెడ్ (KRIDL) పూర్తి చేసిన పనులకు బిల్లులు చెల్లించలేదని ఆరోపిస్తూ కాంట్రాక్టర్ సూసైడ్ చేసుకున్నాడు. దావణగెరెకు చెందిన కాంట్రాక్టర్ ప్రసన్న (50) సంతాబెన్నూరులో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన మనోవేదనలను వివరిస్తూ ఓ సూసైడ్ నోట్ రాశాడు.