తాజాగా ప్రముఖ మాజీ న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ శుక్రవారం ఉదయం గుండె పోటుతో కన్నుమూశారు. హైదరాబాదులోని మలక్ పేటలో ఉన్న యశోద ఆసుపత్రిలో గుండెపోటు అనంతరం చికిత్స పొందుతూ ఆయన కోలుకోలేక మృతి చెందాడు. ప్రస్తుత తరం వారికి అంతగా తెలియకపోయినా.. ముందుతరం వారికి తెలుగు దూరదర్శన్ అంటే మొదటిగా చెప్పే పేరు శాంతి స్వరూప్. రాత్రి అయితే చాలు ఆయన వార్తలు చదవటానికి ప్రత్యక్షమవుతారు. Also Read: Living Relationship Murder: నెలన్నరగా లివ్…
ఇప్పుడంటే ఎన్నో ఛానళ్లు ఉన్నాయి. ప్రతిరోజూ 24 గంటలపాటు ప్రసారాలు ప్రసారమౌతూనే ఉన్నాయి. మనదేశంలో తొలిసారిగా టీవీ ప్రసారాలు ఎప్పటి నుంచి ప్రారంభమయ్యాయో తెలుసా.. అంటే చాలా మందికి తెలియకపోవచ్చు. మనకు స్వాతంత్య్రం రాకముందు నుంచే రేడియో ప్రసారాలు అందుబాటులో ఉండేవి. రేడియో ద్వారానే చాలా వరకు విషయాలు తెసుకునేవారు. 1959 నుంచి దేశంలో టీవీ ప్రసారాలు ప్రారంభం అయ్యాయి. అప్పట్లో టీవీ మాధ్యమం రేడియోతో కలిసి ఉండేది. 1965 వ సంవత్సరంలో దూరదర్శన్ను ఏర్పాటు చేశారు.…