ఉత్తరప్రదేశ్లో శాంతి భద్రతలు మెరుగుపడ్డాయని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రకటించిన కొన్ని గంటలకే రాష్ట్రంలో కాల్పులు చోటుచేసుకున్నాయి. అలీగఢ్ విశ్వవిద్యాలయంలో నడకకు వెళ్లిన ఉపాధ్యాయుడి తలపై రెండుసార్లు కాల్చడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటన యూనివర్సిటీలో తీవ్ర కలకలం రేపింది.