బర్మింగ్ హామ్ వేదికగా.. కామన్వెల్త్ క్రీడలు అట్టహాసంగా జరుగుతున్నాయి. ఈ క్రమమంలో.. క్రీడల్లో ఓ అపశ్రుతి చోటుచేసుకుంది. 10కి.మీ స్క్రాచ్ రేసులో భారత సైక్లిస్ట్ మీనాక్షి అదుపుతప్పి కిందపడడ్డారు.. దీంతో వెనుకనుండి వస్తున్న ప్రత్యర్థి న్యూజిల్యాండ్ సైక్లిస్ట్ బ్రయానీ బోథా సైకిల్ మీనాక్షి పై నుంచి దూసుకెళ్లడంతో.. తీవ్రంగా గాయపడింది. అక్కడున్న పోటీ నిర్వాహకులు వెంటనే స్పందించి మీనాక్షిని స్ర్టెచర్ పై తీసుకెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. read…
ఇంగ్లండ్లో బర్మింగ్హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో భారత్ దూసుకెళ్తోంది. ఇప్పటికే మూడు స్వర్ణాలను భారత్ తన ఖాతాలో వేసుకుంది. వెయిట్లిఫ్టింగ్లోనే మూడు స్వర్ణాలు దక్కటం విశేషం. ఇవాళ కూడా భారత్ పతక వేటలో పయనించనుంది.
కామన్వెల్త్ క్రీడల్లో భారత ఆటగాళ్లు తమ సత్తాను చాటుతున్నారు. ఈ క్రీడల్లో వెయిట్లిఫ్టింగ్లో భారత జోరు కొనసాగుతోంది. ఇప్పటివరకు మూడు స్వర్ణాలు భారత్ తన ఖాతాలో వేసుకోగా.. ఆ మూడు కూడా వెయిట్లిఫ్టింగ్లో వచ్చినవే కావడం గమనార్హం.