విశాఖలోని జడ్జీ కోర్టు ఎదురుగా ఉన్న సీఎంఆర్ షాపింగ్ మాల్లో కాస్మోటిక్స్, ఫుట్ వేర్, హోంనీడ్స్ను ఆదివారం ఆ సంస్త యాజమాన్యం ప్రారంభించింది. కార్యక్రమానికి ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, పి.విష్ణుకుమార్ రాజు, వంశీకృష్ణ శ్రీనివాస్, గణబాబు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు తదితరులు హాజరై మాల్ విభాగాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గంటా మాట్లాడుతూ విశాఖకే కాకుండా ఉమ్మడి రాష్ట్రంలోనే సీఎంఆర్ తలమానికంగా నిలిచిందని కొనియాడారు. నాణ్యమైన వస్త్రాల్ని సరసమైన ధరలకే అందించడం సీఎంఆర్ ప్రత్యేకతన్నారు.…