క్లీన్ ఆంధ్రప్రదేశ్లో భాగంగా క్లాప్ కార్యక్రమం కింద ఇప్పటివరకూ చేపట్టిన కార్యక్రమాలను సమగ్రంగా సమీక్షించారు ఏపీ సీఎం జగన్. నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో పరిశుభ్రతకు పెద్దపీట వేయాలన్నారు. వాతావరణానికి, ప్రజలకు హానికరమైన వ్యర్థాల తొలగింపులో అత్యుత్తమ విధానాలు పాటించాలన్నారు. కొత్తగా వస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలను అందుబాటులోకి తీసుకురావాలని, ఎలక్ట్రిక్ వెహికల్స్ను వీలైనంత త్వరగా తెప్పించుకోవాలన్నారు. గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ల నుంచి సమీప ఇళ్లకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎప్పటికప్పుడు గార్బేజ్ను తొలగించడమే…