బంగ్లాదేశ్లో జరుగుతున్న సెలబ్రిటీ క్రికెట్ టీమ్ టోర్నమెంట్లో గ్రూప్ స్టేజ్ మ్యాచ్ సందర్భంగా.. అంపైర్ నిర్ణయంపై చిత్ర నిర్మాత ముస్తఫా కమల్ రాజ్, దీపాంకర్ దీపన్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ గొడవ తీవ్రస్థాయికి చేరడంతో ఘర్షణకు దారితీసింది. ఆ తర్వాత రెండు జట్లలోని కొంతమంది ఆటగాళ్ళు, ఇతర వ్యక్తులు వచ్చి ఒకరితో ఒకరు గొడవపడ్డారు. కొంతమంది బ్యాట్లతో దాడి కూడా చేసుకున్నారు.