రైతే రాజు అని చెబుతుంటే వింటుంటాం. ఓ వీడియోలో ప్రత్యక్షంగా చూసిన నెటిజన్స్ ఆశ్చర్యానికి గురవుతున్నారు. పశువులకు మోత తీసుకెళ్లేందుకు సాధారణంగా రైతులు ఎద్దులబండి, రిక్షాలు ఉపయోగిస్తుంటారు. ప్రస్తుతం ట్రెండ్ మారింది. పోర్షే లగ్జరీ కారులో పశువులకు గడ్డి తరలిస్తున్న ఓ మహిళ రైతు వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.