BSNL: ప్రభుత్వ రంగ సంస్థ టెలికాం సంస్థ బీస్ఎన్ఎల్ కొత్త వినియోగదారులను ఆకర్షించేందుకు తీసుకొచ్చిన ఫ్రీడమ్ ప్లాన్ గడువును పొడిగించింది. ఈ ప్లాన్కు కస్టమర్ల నుంచి విశేష స్పందన వస్తుండటంతో మరో 15 రోజులు కొనసాగించాలని నిర్ణయించింది. ఈ ఫ్రీడమ్ ప్లాన్ ఆదివారంతో గడువు ముగియగా దానిని ఈనెల 15వరకు పొడిగించినట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ ప్లాన్ కింద రూ.1కే ఉచిత సిమ్తో పాటు 30 రోజుల అన్లిమిటెడ్ కాల్స్, రోజుకు 2GB హైస్పీడ్ ఇంటర్నెట్ లభిస్తుంది.…