ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రిజర్వేషన్ల విధానాలకు సంబంధించి గత కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రధాని నరేంద్ర మోడీ తప్పుడు ఆరోపణలు చేశారని కాంగ్రెస్ ప్రభుత్వ సలహాదారు మహ్మద్ షబ్బీర్ అలీ తీవ్రంగా విమర్శించారు. రిజర్వేషన్ల వ్యవస్థపై మోడీకి అవగాహన లేక కావాలనే అసత్య ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్లో సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన ముస్లిం వర్గాలకు 2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం 4% రిజర్వేషన్లు అమలు చేసిందని ఆయన గుర్తు చేశారు.…
ప్రధాని మోడీ వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని సీఈఓ వికాస్ రాజ్ కు కాంగ్రెస్ నేతలు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకురాలు శోభారాణి మాట్లాడుతూ.. నరేంద్ర మోడీ రెండు మూడు రోజులుగా మాజీ ప్రధాని పై చిల్లర మాటలు మాట్లాడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఎస్సి, ఎస్టీ, మైనార్టీ వర్గాల వారిని కించపరిచే విధంగా మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. నరేంద్రమోడీ వ్యాఖ్యలు సరికాదు. నరేంద్రమోడీ వ్యాఖ్యలను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆమె…
హైదరాబాద్ వాసులు మే 9వ తేదీన తమ నీడలు కనుమరుగయ్యే అసాధారణ సంఘటనను అనుభవించనున్నారు! ‘జీరో షాడో డే’గా పిలువబడే ఈ విశిష్ట దృగ్విషయం మధ్యాహ్నం 12:12 నుండి 12:19 గంటల మధ్య జరుగుతుంది. ఈ సమయంలో, సూర్యుడు నేరుగా మధ్యాహ్న సమయంలో తలపైకి ఉంటుంది, దీని వలన నిలువు వస్తువుల నీడలు కనిపించవు. నీ నీడలా వెంటాడుతా.. అంటుంటారు. ఎప్పుడూ మన వెంటే ఉండే నీడలా నన్ను ఫాలో అవుతాను అనే ఉద్దేశంలో మాట్లాడుతుంటారు. సాధారణంగా…
పెదకూరపాడు నియోజకవర్గంలో వైఎస్సార్సీపీని గెలిపించి.. సీఎం జగన్ కు బహుమతిగా ఇవ్వాలని అచ్చంపేట మండలం కస్తలలో పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకరరావు అన్నారు. ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే నంబూరు శంకరరావు, నర్సరావుపేట ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ కు ఘనస్వాగతం పలికిన ప్రజలు.. హారతులు పట్టారు. నంబూరు శంకరరావు మాట్లాడుతూ.. వేల్పూరులో గత ఐదేళ్లలో 25 కోట్లతో సంక్షేమం అందించామన్నారు. రూ.2.59 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించామన్నారు. జగనన్న అమ్మఒడి ద్వారా రూ.2.18 కోట్లు అందించామన్నారు.…
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చారని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలలో ఎవరైనా లబ్ధిపోందారా అని కేటీఆర్ అన్నారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. రుణమాఫీ చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, 420 హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చారన్నారు. రైతులకు రైతు బంధు రావడం లేదని, దేవుళ్ళు పై ఓట్టు వేసి ఓటర్లను మభ్యపెడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ అభ్యర్థి గెలిస్తేనే … బీజేపీ, కాంగ్రెస్ కు భయం ఉంటుందన్నారు. చేవెళ్ల…
జూన్ 4న కమలం వికసించబోతోందన్నారు మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్రావు. ఇవాళ ఎన్టీవీ నిర్వహించిన క్వశ్చన్ అవర్లో రఘునందన్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్టీవీ పాత్రికేయులు సంధించిన ప్రశ్నలకు సమాధానంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ను ఇంటికి పంపించాలని ప్రజలు నిర్ణయించుకున్నారని, బీజేపీ- బీఆర్ఎస్ ఒక్కటే అని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. 7 నుంచి 14 శాతం వరకు ఓట్లు పెంచుకున్నామన్నారు రఘునందన్ రావు. ఒక సీటు నుంచి 7 అసెంబ్లీ సీట్లకు బీజేపీ…
ఎన్నో సంవత్సరాలుగా కష్టపడి చెమటోడ్చితే మూడు రంగుల జెండా అధికారులకు వచ్చిందని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. ఇవాళ ఆయన భద్రాద్రి కొత్తగూడెంలో మాట్లాడుతూ.. అధికారాన్ని సుస్థిరం కోసం భారతదేశ మొత్తం భారత్ జోడయాత్ర రాహుల్ చేపట్టడం జరిగిందని, అందర్నీ కలుపుకుంటూ కాంగ్రెస్ పార్టీ అన్నారు. గత ఎన్నికల్లో వామపక్ష పార్టీల మద్దతుతో బీఆర్ఎస్, మత బీజేపీని ఓడించామన్నారు. జరగబోయే ఎన్నికల్లో వారి మద్దతు డిప్యూటీ సీఎం మల్లు భట్టి కోరడం జరిగిందని, 40 ఏళ్ల…
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఎన్నికల వాగ్దానాలు రాజకీయ స్టంట్గా మారాయని, రైతులను ఆదుకోవాలని బీజేపీ మెదక్ అభ్యర్థి ఎం. రఘునందన్రావు అన్నారు. మంగళవారం మెదక్ లోక్సభ నియోజకవర్గానికి నరేంద్రమోదీ ప్రభుత్వం ఇచ్చిన నిధుల పుస్తకాన్ని విడుదల చేసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదన్నారు. ‘‘ఆగస్టులోగా సీఎం వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తారని రైతులు ఆశించకూడదు. అది జరగదు. ఆయన చేసిన వాగ్దానాలన్నీ ప్రజల ఓట్లను పొందేందుకు…
రేవంత్ రెడ్డి రెండు నాలుకల సిద్దాంతం బయట పడిందని మాజీ మంత్రి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న అన్నారు. ఇవాళ ఆయన ఆదిలాబాద్లో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి ది రెండు కళ్ళ సిద్దాంతం.. ఆయన లోపల బీజేపీ, బయట కాంగ్రెస్ అని ఆయన అన్నారు. అప్పుడు బడే భాయ్ అన్నావు ఇప్పుడు మోడీ ని తిట్టారని, కాంగ్రెస్ బీజేపి ఒక్కటే. మోడి ని చూస్తే రేవంత్ కి భయమని, నీకే అభద్రతా భావం తో ఉన్నావని…
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ ను కలిసి స్పీకర్పై బీజేపీ నేతలు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, మాధవి లత కంప్లైంట్ చేశారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి కాంగ్రెస్ ఎన్నికల్లో గెలువడానికి విపరీతమైన ప్రయత్నాలు చేస్తుందన్నారు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి. స్పీకర్ గడ్డం ప్రసాద్ రాజ్యాంగ నిబంధనలు తుంగలో తొక్కి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారని, కాంగ్రెస్ చేవెళ్ల అభ్యర్థి రంజిత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలోముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి స్పీకర్…