భక్తిటీవీ సగర్వంగా నిర్వహిస్తున్న కోటి దీపోత్సవం వేడుకలు అంబరాన్నంటాయి. ఈ నెల 12 నుంచి 22 వరకు జరుగుతున్న కోటి దీపోత్సవం వేడుకలు నేడు 9వ రోజుకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు కార్యక్రమాలను ఓ సారి చూద్దామా.. సుందరంగా అలకంరించిన వేదికపైన మైసూరు అవధూతపీఠం పూజ్యశ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారిచే అనుగ్రహ భాషణం. బ్రహ్మశ్రీ మైలవరపు శ్రీనివాసరావుచే ప్రవచనామృతం. అనంతరం కొల్పపూర్ శ్రీమహాలక్ష్మీ అమ్మవారికి కుంకుమార్చన వేదికపైనే కాకుండా భక్తులతో కూడా ఈ…