రాజకీయ కురువృద్ధుడు, బీజేపీ సీనియర్ నేత ఎల్కే. అద్వానీ తన సభ్యత్వాన్ని పునరుద్ధరించుకున్నారు. గురువారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. అద్వానీ నివాసానికి వెళ్లి సభ్యత్వాన్ని పునరుద్ధరించారు. సభ్యత్వ పునరుద్ధరణ కాపీని అద్వానీకి నడ్డా అందజేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అలాగే సాయంత్రం సీనియర్ నాయకుడు మురళీ మనోహర్ జోషి నివాసానికి వెళ్లి సభ్యత్వాన్ని పునరుద్ధరించారు.