మగాళ్లపై ఆసక్తి లేకపోవడంతో ఇద్దరు యువతులు ప్రేమించుకుని వివాహం చేసుకున్న సంఘటన బీహార్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. సంప్రదాయాలకు భిన్నంగా జరిగిన ఈ వివాహం స్థానికంగా చర్చనీయాంశంగా మారడమే కాకుండా, సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతోంది. బీహార్లోని సుపౌల్ జిల్లాకు చెందిన పూజా (21), కాజల్ (18) అనే ఇద్దరు యువతులు ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం పెంచుకున్నారు. ఒకే ఆలోచనలు, అభిరుచులతో దగ్గరైన వీరి పరిచయం క్రమంగా ప్రేమగా మారింది. రెండేళ్లుగా ప్రేమలో ఉన్నామని, ఒకరిని విడిచి…