AP High Court: అధికారుల నిర్లక్ష్యంపై ఘాటు వ్యాఖ్యలు చేసింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. విశాఖపట్నం జిల్లా భీమునిపట్నం పరిధిలో సీఆర్జెడ్ (CRZ) నిబంధనలకు విరుద్ధంగా సముద్రానికి అతిసమీపంలో కాంక్రీట్ గోడ నిర్మాణం జరుగుతోందన్న ఆరోపణలపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా అధికారుల నిర్లక్ష్యంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కాంక్రీట్ గోడ నిర్మాణం జరుగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. బాధ్యులైన అధికారులను రక్షించేందుకు జీవీఎంసీ కమిషనర్ ప్రయత్నిస్తున్నారనే…