Tummala Nageswara Rao: సామజిక న్యాయం కోసం రాహుల్గాంధీ భారత దేశం వ్యాప్తంగా పాదయాత్ర చేశారని.. సామాజిక విప్లవం కోసం మ్యానిఫెస్టోలో పెట్టారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రాహుల్ గాంధీ మాటా నిలబెట్టడానికి రేవంత్ రెడ్డి తెలంగాణలో బీసీ గణన చేశారన్నారు.. సత్తుపల్లి పట్టణంలో బీసీ బంద్ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాగమయితో కలిసి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు.. సత్తుపల్లి పాత సెంటర్ నుంచి బస్టాండ్ సర్కిల్లోని అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు.