Food Poisoning: కేరళలో ఫుడ్ పాయిజనింగ్ వల్ల 100 మందికి ఫుడ్ పాయిజనింగ్ బారిన పడ్డారు. వీరంతా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కేరళలో పతినంతిట్ట జిల్లాలో ఈ ఘటన జరిగింది. బాప్టిజం వేడుకలకు హాజరైన 100 మంది వ్యక్తులు గతవారం డిసెంబర్ 29న ఫుడ్ పాయిజనింగ్ బారిన పడ్డారు. ఫుడ్ సప్లై చేసిన క్యాటరింగ్ సర్వీస్ కంపెనీపై పోలీసులు కేసులు నమోదు చేశారు. కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు.