పేపర్ బాయ్ సినిమాతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న జయ శంకర్ దర్శకుడిగా అరి అనే ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాతో ఆడియెన్స్ ముందుకు రాబోతోన్నారు. ప్రస్తుతం సినిమాను ప్రమోట్ చేసుకునే పనిలో టీం బిజీగా ఉంది. సైకో మైథలాజికల్ థ్రిల్లర్గా తెరకెక్కిన అరి మూవీని ప్రత్యేకంగా కొంత మంది కోసం ప్రదర్శించారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మఠాధిపతులు, స్వామిజీలు ఈ మూవీని వీక్షించి ప్రశంసలు కురిపించి భగవద్గీతలోని సారాన్ని అరి చిత్రంలో అద్భుతంగా చూపించారని అన్నారు.…