గత ఎన్నికల్లో గోశామహల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ నుండి ఒక నార్త్ ఇండియన్కు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని తమ అధినేత కేసీఆర్ నిర్ణయించారని... ఆ నిర్ణయం మేరకే నంద కిషోర్ వ్యాస్ ( బిలాల్ ) కు టికెట్ కేటాయించారని గోశామహల్ బీఆర్ఎస్ నాయకుడు ఎమ్.ఆనంద్ కుమార్ గౌడ్ అన్నారు. ప్రచారంలో కూడా కేటీఆర్ రెండు సార్లు నియోజకవర్గంలో ప్రచారం చేశరని గుర్తు చేశారు. అయితే నందు బిలాల్ అసమర్థత వల్ల గెలిచే సీటు ఓడిపోవాల్సి వచ్చిందన్నారు.