వచ్చే బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం అంబేద్కర్ అభయహస్తం కింద దళితులకు రూ.12 లక్షల సాయం ప్రకటించి ఇచ్చిన హామీని నెరవేర్చాలని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కెటి రామారావు డిమాండ్ చేశారు. దళితుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంటే బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రవేశపెట్టిన దళిత బందు కంటే గొప్ప పథకాన్ని ప్రకటించాలి. దళితుల ఆర్థిక స్థితిని మెరుగుపరచడం ద్వారా వారిని సంపన్నులుగా మార్చేందుకు, స్వాతంత్య్రం వచ్చిన తర్వాత తొలిసారిగా…