ఆంధ్రప్రదేశ్లో ఎయిర్పోర్ట్ల విస్తరణపై సమీక్ష సమావేశం నిర్వహించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న విమానాశ్రయాలతో పాటు కొత్తగా నిర్మిస్తున్న విమానాశ్రయాలకు సంబంధించి ఈ సమావేశంలో చర్చ జరిగింది.. కుప్పం ఎయిర్పోర్ట్కు సంబంధించి పరిస్థితిపై చంద్రబాబు నాయుడు.. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు..