ఎన్ని మార్కులొచ్చాయ్? ర్యాంక్ ఎంత? ఆ వన్ మార్క్ ఎందుకు తగ్గింది? తరుచుగా ఇండియాలో తల్లిదండ్రులు, టీచర్ల నుంచి విద్యార్థులకు ఎదురయ్యే ప్రశ్నలివి. ఈ ఏఐ కాలంలోనూ ప్రతిభను కొలవడానికి మార్కులే ప్రామాణికం కావడం బాధాకరమే.. ఎందుకంటే ఇతర దేశాలు తమ విద్యావ్యవస్థలను మార్చుకొని అభివృద్ధిలో దూసుకెళ్తున్నాయి. ఉదాహరణకు మన పక్కనే ఉండే చైనా ఎడ్యూకేషన్ సిస్టమ్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూపోతోంది. ఇలా ఒకే వయసు.. ఒకే తరగతి కానీ… రెండు దేశాల్లో రెండు వేర్వేరు భవిష్యత్తులు…