Bus Accident: సౌదీ అరేబియాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. మక్కా నుంచి మదీనాకు ప్రయాణిస్తున్న భారతీయ యాత్రికులతో నిండిన బస్సు బదర్- మదీనా మధ్య ముఫరహత్ ప్రాంతంలో డీజిల్ ట్యాంకర్ను ఢీకొట్టింది. ఢీకొట్టిన వెంటనే ట్యాంకర్లోని ఇంధనం ధాటికి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. కొన్ని నిముషాల్లోనే మొత్తం బస్సు మంటల్లో చిక్కుకుంది. ఈ భయానక ప్రమాదంలో 42 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 20 మంది మహిళలు, 11 మంది చిన్నారులు ఉన్నట్లు స్థానిక…