బ్యాంకర్ల తో ఏర్పాటు చేసే సమావేశాల్లో రైతులు, ప్రజలు, ప్రభుత్వ ఆకాంక్షలకు అనుగుణంగా నిర్ణయాలు ఉండాలన్నారు సీఎం చంద్రబాబు . రోటీన్ సమావేశాల వల్ల ఎలాంటి ప్రయోజనం లేదన్నారు.. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన 232వ రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశం జరిగింది.. వ్యవసాయ, ప్రాథమిక రంగాలు, MSME, గ్రామీణ బ్యాంకింగ్ సేవలపై సమీక్ష నిర్వహించారు..