నేడు స్వేఛ్చా వాయువులు పీలుస్తూ ఎలాంటి టెన్షన్ లేకుండా నిద్రిస్తున్నామంటే దానికి కారణం వీరుల ప్రాణ త్యాగాలు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. షహీద్ దివస్ (అమరవీరుల దినోత్సవం) భారతదేశంలో ప్రతి సంవత్సరం మార్చి 23న జరుపుకుంటారు. ఈ రోజు భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ల మహా త్యాగాలను స్మరించుకునే దినం. 1931 మార్చి 23న లాహోర్ సెంట్రల్ జైలులో బ్రిటిష్ పాలకులు భగత్ సింగ్, శివరామ్ రాజ్గురు, సుఖ్దేవ్ థాపర్లను ఉరితీశారు. వీరు కేవలం…