Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Story Board Wives Killing Husbands Sonam Tejeshwar Aiswarya Case

Story Board : నమ్మించి భర్తల గొంతులు కోస్తున్నారా.? మహిళల్లో క్రూరత్వం పెరుగుతోందా.?

Published Date :June 24, 2025 , 8:32 am
By Gogikar Sai Krishna
  • ప్రేమ పేరుతో పెళ్లి... ఆ తర్వాత కిరాతక హత్య
  • సుపారీ హత్యలు, ప్రియుడితో కలిసిన కుట్రలు బయటకు
  • సోనమ్-రఘువంశీ, ఐశ్వర్య-తేజేశ్వర్ కేసులతో దేశం షాక్
Story Board :  నమ్మించి భర్తల గొంతులు కోస్తున్నారా.? మహిళల్లో క్రూరత్వం పెరుగుతోందా.?
  • Follow Us :
  • google news
  • dailyhunt

నిన్న సోనమ్-రఘువంశీ…నేడు ఐశ్వర్య-తేజేశ్వర్‌…ఒకటా రెండా…దొరికిపోతామనే భయం లేదు. చేసేది తప్పనే సోయి లేదు. ఎంతకైనా బరి తెగిస్తున్నారు. కట్టుకున్న భర్తలనే లేపేస్తున్నారు. చంపటమే పరిష్కారం అనుకుంటున్నారు. కొందరు భార్యల్లో క్రూరత్వం పెరిగిపోతోంది. రాక్షస భార్యల గురించి చెప్పుకుంటూ…పోతే హిస్టరీ చాంతాడంత ఉంది. మెజారిటీ మర్డర్‌ కథల్లో ఇప్పుడు భార్యే హంతకురాలు…భర్తే హతుడు.

అందంగా తయారై పెళ్లిపీటలు ఎక్కుతున్నారు. కల్యాణమండపంలో…తలవంచి భర్తతో మూడు ముళ్లు వేయించుకుంటున్నారు. కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితుల ముందు…మహానటిలా నటిస్తూ…ఎంతో సంతోషంగా నాలుగడుగులు వేస్తున్నారు. పెళ్లి తతంగం కాస్తా ముగిశాక…తమలోని రాక్షసత్వాన్ని బయటికి తీస్తున్నారు. పెళ్లిలో ఎంత అమాయకంగా ఉంటున్నారో…ఆ తర్వాత భర్తలకు అసలు సినిమా చూపిస్తున్నారు. తమ ప్రేమ వ్యవహారాలను దాచిపెట్టి….కట్టుకున్న భర్తలను కిరాతకంగా హత్య చేయిస్తున్నారు. నమ్మించి కట్టుకున్నోడి గొంతు కోస్తున్నారు. హత్య చేశాక…మాయ మాటలతో తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. సీన్‌ కట్‌ చేస్తే…పోలీసుల విచారణలో అసలు బాగోతం బయటపడుతోంది.

కొందరు ప్రేమించిన వాడిని కాదని పెళ్లి చేసుకుంటున్నారు. ఆ తర్వాత ప్రియుడితో కలిసి భర్తలను అంతమొందిస్తున్నారు. మరికొందరు పెళ్లయ్యాక…వివాహేతర సంబంధాలు పెట్టుకుంటున్నారు. వివాహమై నెలయిందా ? రెండు నెలలైందా అన్నది చూడటం లేదు. పెళ్లయితే ఏంటి ? వివాహేతర సంబంధమే తమకు ముఖ్యమనుకుంటున్నారు. అదే తమ జీవితమని నమ్మేస్తున్నారు. ముందుకు వెనుక ఆలోచించడం లేదు. భార్యల్లో అసహనం పెరుగుతోంది. ఎలాగైనా అనుకున్నది దక్కించుకోవాలనే ఆరాటం అంతులేకుండా పోతోంది. దానికోసం ఏం చేయటానికైనా వెనుకాడటం లేదు. ఇవన్నీ కలిసి జనాన్ని నేరాలవైపు నెడుతున్నాయి. హత్యలకు పురికొల్పుతున్నాయి. నేరం చేయటం ఒక తప్పైతే..అది చేసి కూడా తప్పించుకోవచ్చని భ్రమపడటం మరోకోణం..ఇదే ఇప్పుడు అనేక నేరాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. దీనికోసం అనేక కథలల్లి, కేసుని తప్పుదారి పట్టించే ప్రయత్నాలు ఎన్ని చేసినా…చివరికి పోలీసులకు చిక్కిపోతున్నారు.

తెలుగు రాష్ట్రాల్లోనే…దేశంలోనూ అనేక మహిళలు…కట్టుకున్న భర్తలను లేపేస్తున్నారు. భర్త ముందు ఏం తెలియనట్లు నటిస్తున్నారు. ప్రియుడి మోజులో…కంటుకున్నోడిని కనికరం లేకుండా చంపేస్తున్నారు. కొందరు సుపారీ ఇచ్చి హత్య చేయిస్తున్నారు. మరికొందరు తామే స్వయంగా హత్యల్లో పాలు పంచుకుంటున్నారు. ఇంకొందరైతే…భర్తను చంపేసిన తర్వాత తమ ప్రియుళ్లకు వీడియో కాల్స్‌ చేసి చూపిస్తున్నారు. టెక్నాలజీ పెరిగే కొద్దీ…మహిళల్లో పైశాచికత్వం పెరిగిపోతూనే ఉంది. పిల్లలున్నా…అమితంగా ప్రేమించే భర్త ఉన్నా పట్టించుకోవడం లేదు. ప్రియుడే సర్వం అనుకుంటున్నారు. భర్తనే రాక్షసుడని భావిస్తున్నారు. దీంతో వివాహ బంధాలు బీటలు వారుతున్నాయి.

జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన సర్వేయర్‌ తేజేశ్వర్ దారుణ హత్యకు గురయ్యాడు. జూన్ 21న నంద్యాల జిల్లా పాణ్యం సమీపంలో తేజేశ్వర్ మృతదేహం లభ్యమైంది. సరిగ్గా నెల రోజుల క్రితమే వివాహ బంధంతో కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన తేజేశ్వర్‌ను దుండగులు పొలం సర్వే చేయాలనే నెపంతో పిలిచారు. ఆ తర్వాత అత్యంత కిరాతకంగా హత్య చేయడం జిల్లా వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. వివాహం జరిగి కేవలం నెల రోజులు కూడా గడవకముందే హత్యకు గురయ్యాడు. తేజేశ్వర్‌ మరణంపై కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. మృతుడి భార్య, అత్త ప్రమేయం ఉండొచ్చనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో అసలు కుట్ర బయటపడింది.

పోలీసుల విచారణలో…తేజేశ్వర్ హత్య కేసులో సంచలవ విషయాలు వెలుగుచూస్తున్నాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు ప్రాణాలు కోల్పోయాడు తేజేశ్వర్. పెళ్లిలోనూ అనేక ట్విస్టులు చోటు చేసుకున్నాయి. తేజేశ్వర్, ఐశ్వర్యలకు పెళ్లి చేయాలని .. ఫిబ్రవరి 13న పెద్దలు నిశ్చయించారు. ఫిబ్రవరి 8న బ్యాంకు ఉద్యోగి తిరుమలరావుతో ఐశ్వర్య వెళ్లిపోయింది. 15న ఇంటికి తిరిగివచ్చింది. విషయం తెలుసుకున్న తేజేశ్వర్ కుటుంబసభ్యులు…పెళ్లిని రద్దు చేసుకుంటామని చెప్పారు. తేజేశ్వర్‌తో మాటలు కలిపిన ఐశ్వర్య… కట్నం కోసం బంధువుల ఇంటికి వెళ్లామంటూ నమ్మించింది. ప్రేమలోకి దించి తేజేశ్వర్‌ను పెళ్లికి ఒప్పించింది. దీంతో కుటుంబసభ్యులు వద్దని వారిస్తున్నా వినకుండా తేజేశ్వర్‌…ఐశ్వర్యను వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత తేజేశ్వర్ కిడ్నాప్.. హత్య జరిగాయి.

మేఘాలయ హనీమూన్ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచనలం సృష్టించింది. హోమ్​స్టేలోని సూట్​కేస్​లో దొరికిన మంగళసూత్రమే సోనమ్‌కు పట్టించింది. హనీమూన్​ కోసం మేఘాలయకు వచ్చిన సోనమ్, రఘువంశీ మే 22న సోహ్రాలో ఓ హోమ్‌స్టేకు వెళ్లారు. అయితే అక్కడ గది అందుబాటులో లేకపోవడంతో తమ సూట్‌కేస్‌ను అక్కడే ఉంచారు. నాంగ్రియాట్ గ్రామానికి ట్రెక్కింగ్‌ కు వెళ్లారు. ఆ రాత్రి నాంగ్రియాట్‌లోని మరో హోమ్‌స్టేలో బస చేశారు. మే 23న ఉదయాన్నే అక్కడి నుంచి బయలుదేరారు. అనంతరం సోహ్రాకు తిరిగివచ్చి, తమ స్కూటర్‌ను తీసుకుని వీసాడాంగ్ జలపాతం వైపు వెళ్లారు. అక్కడే రాజా రఘువంశీ హత్యకు గురయ్యాడని పోలీసులు తెలిపారు.

రాజా రఘువంశీ-సోనమ్ దంపతులు ఉన్న హోటల్ రూమ్‌లో పోలీసులు సోదా చేయడంతో…అక్కడ సూట్​కేస్ దొరికింది. అందులో మంగళసూత్రం, ఒక ఉంగరం ఉన్నాయి. అయితే కొత్తగా పెళ్లి అయిన మహిళ రూమ్​లోనే తాళిని, సూట్‌కేస్‌లో ఉంగరాన్ని పెట్టి వెళ్లడం మాకు కొత్త అనుమానాలను కలిగించింది. హిందూ సంప్రదాయంలో మంగళసూత్రాన్ని స్త్రీ వైవాహిక జీవితానికి పవిత్ర చిహ్నంగా భావిస్తారు. ముఖ్యంగా కొత్తగా పెళ్లయిన వారు దానిని దాదాపుగా తీయరు. ఈ కోణంలోనే దర్యాప్తును మముర్మం చేశారు. అప్పుడే నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టగా నేరాన్ని అంగీకరించారు. ఈ కేసులో మరో నిందితుడిగా ఉన్న ఆమె సోనమ్ ప్రియుడు రాజ్‌ కుష్వాహా సమక్షంలో సోనమ్‌ను ప్రశ్నించారు. తన భర్త హత్యకు చేసిన కుట్రలో తన ప్రమేయం ఉన్నట్లు ఆమె అంగీకరించింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Aishwarya Tejeshwar murder
  • crime
  • Domestic violence
  • honeymoon Murder
  • Husband murder cases

తాజావార్తలు

  • Abhishek Sharma Catch Controversy: క్యాచ్‌పై డ్రామా..! అభిషేక్ శర్మ ఔటా కాదా..?

  • Tax Refund: ఇన్‌కమ్ ట్యాక్స్ పేయర్లకు బిగ్‌షాక్.. వారికి రీఫండ్స్ నిలిపివేత..

  • HYD Terros Gardening Story: ఫుల్ ట్రెండ్‌లో టెర్రస్ గార్డెనింగ్ కల్చర్.. సిటీ జనాలు ఎందుకు ఇటు వైపు మళ్లుతున్నారు?

  • Off The Record: జగన్ ప్లాన్ బీ.. ‘మావిగన్’పై రాజకీయవర్గాల్లో చర్చలు

  • Shroud Of Turin: ఏసు క్రీస్తు “చివరి వస్త్రం” భారత్ నుంచే వచ్చిందా?.. షాకింగ్ డీఎన్ఏ రిపోర్ట్..

ట్రెండింగ్‌

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions