పురుషుల ఐపీఎల్ తరహాలోనే బీసీసీఐ మహిళా క్రికెటర్లకు కూడా ఐపీఎల్ను నిర్వహిస్తోంది. అయితే మహిళల ఐపీఎల్ కేవలం మూడు జట్లు మాత్రమే పాల్గొంటున్నాయి. ఈ మేరకు తాజాగా బీసీసీఐ నాలుగో సీజన్ మహిళల టీ20 ఛాలెంజ్ షెడ్యూల్ను ప్రకటించింది. సూపర్ నోవాస్, ట్రైల్ బ్లేజర్స్, వెలాసిటీ జట్ల మధ్య ఈ టోర్నీ జరగనుంది.
మే 23న ప్రారంభం కానున్న ఈ టోర్నీలో మొదటి మ్యాచ్ మూడో సీజన్ ఫైనలిస్టులు ట్రైల్బ్లేజర్స్ వర్సెస్ సూపర్ నోవాస్ మధ్య జరగనుంది. మే24న సూపర్నోవాస్, వెలాసిటీ తలపడతాయి. ఆ తర్వాత మే 26న ట్రైల్బ్లేజర్స్తో వెలాసిటీ తలపడుతుంది. ఈ మూడు మ్యాచ్లలో టాప్ 2 ప్లేస్లో నిలిచిన మొదటి రెండు జట్ల మధ్య ఫైనల్ జరుగుతుంది. ఫైనల్లో గెలిచిన జట్టు విజేతగా నిలుస్తుంది. ఫైనల్ మ్యాచ్ మే 28న జరుగుతుంది. అన్ని మ్యాచ్లు పూణెలోని ఎంసీఏ స్టేడియంలో జరగనున్నాయి.
జట్ల వివరాలు:
సూపర్ నోవాస్: హర్మన్ ప్రీత్ కౌర్ (కెప్టెన్), తనియా భటియా (వైస్ కెప్టెన్), అలానా కింగ్, ఆయుష్ సోనీ, చందు వీ, దీయాంద్ర దత్తీన్, హర్లీన్ డియోల్, మేఘన సింగ్, మోనికా పటేల్, ముక్సాన్ మాలిక్, పూజా వస్త్రాకర్, ప్రియా పునియా, రషీ కనోజియా, సోఫీ ఎక్లేస్టోన్, సునే లూజ్, మన్షీ జోషీ.
ట్రైల్ బ్లేజర్స్: స్మృతి మంధాన (కెప్టెన్), పూనమ్ యాదవ్ (వైస్ కెప్టెన్), అరుంధతీ రెడ్డి, హయల్లీ మాథ్యుస్, జెమిమీయా రోడ్రీగ్స్, ప్రియాంక ప్రియదర్శిని, రాజేశ్వరి గైక్వాడ్, రేణుక సింగ్, రిచా గోష్, ఎస్.మేఘన, సైకా ఇషాకూ, సల్మా ఖాతూన్, షమీన్ అక్తర్, సుజాత మాలిక్, సోఫీయా బ్రౌన్, ఎస్బీ ప్రభాకర్.
వెలాసిటీ: దీప్తి శర్మ(కెప్టెన్), స్నేహ రాణా (వైస్ కెప్టెన్), సఫాలీ వర్మ, అయబంగ కాకా, కేపీ నవీగిరే, కాతిరన్ క్రాస్, కీర్తి జేమ్స్, లౌరా వాల్వర్డ్, మాయా సోనవనే, నత్తకమ్ ఛాంతమ్, రాధా యాదవ్, ఆర్తి కేదర్, శివాలి షిండే, సిమ్రాన్ బహదూర్, యస్తికా భాటియా.