శిఖర్ధావన్ నేతృత్వంలోని 20 మంది సభ్యుల టీమ్ఇండియా శ్రీలంక వెళ్లారు. బీసీసీఐ ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో వీరంతా వెళ్లారు. వచ్చేనెల ఆ జట్టుతో మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనున్నారు. ఈ క్రమంలో గత రెండు వారాలుగా ముంబైలోని ఓ స్టార్ హోటల్లో క్వారంటైన్లో ఉన్న వారు దానిని పూర్తిచేసుకున్నారు. కాగా, ఆటగాళ్లు విమానంలో వెళ్తున్న ఫొటోలను అలాగే అక్కడికి చేరుకున్న ఫోటోలను బీసీసీఐ పోస్ట్ చేసింది. మరోవైపు ఈ జట్టులో పలువురు సీనియర్లతో పాటు కొంతమంది తొలిసారి జట్టుకు ఎంపికైనవారు కూడా ఉన్నారు. అవకాశం వస్తే సత్తా చాటాలని చూస్తున్నారు. ముఖ్యంగా పృథ్వీషా, కుల్దీప్ యాదవ్, యుజువేంద్ర చాహల్, భువనేశ్వర్ కుమార్ లాంటి ఆటగాళ్లు ఇంతకుముందులా తమ స్థానాలను పదిలపర్చుకోవాలని ఆశిస్తున్నారు.
శ్రీలంక చేరుకున్న భారత జట్టు…
