త్వరలో ఐపీఎల్-15 ప్రారంభం కానుంది. ఈ మేరకు ఇటీవల ఐపీఎల్ మెగా వేలం కూడా పూర్తయింది. అయితే సన్రైజర్స్ కీలక ఆటగాళ్లను కొనుగోలు చేయలేదని.. ఈ మేరకు ఆ జట్టు బ్యాటింగ్ ఆర్డర్ ఎలా ఉంటుందో అన్న అనుమానాలు అభిమానుల్లో రేకెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో సన్రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ కోచ్ ముత్తయ్య మురళీధరన్ వచ్చే సీజన్లో సన్రైజర్స్ బ్యాటింగ్ ఆర్డర్ ఎలా ఉండబోతుందో సూచన ప్రాయంగా చెప్పేశాడు.
కేన్ విలియమ్సన్, అభిషేక్ శర్మ ఓపెనింగ్కు వస్తారని… ఆ తర్వాత మార్క్రమ్, రాహుల్ త్రిపాఠి, నికోలస్ పూరన్, అబ్దుల్ సమద్, వాషింగ్టన్ సుందర్ బ్యాటింగ్కు వస్తారని మురళీధరన్ వెల్లడించాడు. ఇక బౌలింగ్ విషయానికి వస్తే భువనేశ్వర్, నటరాజన్, శ్రేయాస్ గోపాల్, మాక్రో జాన్సన్ బరిలోకి దిగుతారని తెలుస్తోంది. గత సీజన్లో పేలవ ప్రదర్శన చేసిన సన్రైజర్స్ హైదరాబాద్ టీమ్ వచ్చే సీజన్లో అయినా ప్లే ఆఫ్స్కు చేరుతుందో లేదో అంటూ అభిమానులు ఇప్పటి నుంచే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
