NTV Telugu Site icon

టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న శ్రీలంక

కొలంబో వేదికగా టీం ఇండియా మరియు శ్రీలంక జట్ల మధ్య తొలి టీ-20 మ్యాచ్‌ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ మ్యాచ్‌ లో టాస్‌ గెలిచిన ఆతిథ్య జట్టు కెప్టెన్‌ డాసున్‌ శనక తొలుత ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు. దీంతో భారత జట్టు బ్యాటింగ్‌కు దిగనుంది. ఇంతకు ముందు జరిగిన మూడు వన్డేల సిరీస్‌ లో భారత్‌ 2-1 తేడాతో విజయ సాధించిన సంగతి తెలిసిందే.
ఇక జట్టు వివరాల్లోకి వస్తే.. .

ఇండియా ; శిఖర్ ధావన్ (సి), పృథ్వీ షా, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, సంజు సామ్సన్ (డబ్ల్యూ), హార్దిక్ పాండ్యా, క్రునాల్ పాండ్యా, దీపక్ చాహర్, భువనేశ్వర్ కుమార్, యుజ్వేంద్ర చాహర్, వరుణ్ చక్రవర్

శ్రీలంక : అవిష్కా ఫెర్నాండో, మినోడ్ భానుకా (డబ్ల్యూ), ధనంజయ డి సిల్వా, చరిత్ అసలాంకా, దాసున్ షానక (సి), అషేన్ బండారా, వనిండు హసరంగ, చమికా కరుణరత్నే, ఇసురు ఉదనా, అకిలా దనంజయ, దుష్మంత చమీరా