Ruturaj Gaikwad: సెంచరీ వెనుక సీక్రెట్ ఇదే.. రుతురాజ్ గైక్వాడ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో భారత్ అద్భుత విజయం
- సెంచరీ బాదిన రుతురాజ్ గైక్వాడ్
- సెంచరీ వెనుక సీక్రెట్ ఏంటో చెప్పిన రుతురాజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ట్రై నేషన్ ఏ సిరీస్ 2026లో భాగంగా మంగళవారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో భారత్ అద్భుత విజయాన్ని అందుకుంది. సెంచరీతో భారత్-ఏ జట్టుకు విజయం అందించిన రుతురాజ్ గైక్వాడ్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు. దంబుల్లా వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో 114 బంతుల్లో 101 పరుగులు చేసి భారత్-ఏ జట్టుకు భారీ స్కోరు అందించాడు. మ్యాచ్ అనంతరం తన ఇన్నింగ్స్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తనకు ఎలాంటి గణాంకాలు తెలియవని, అయితే సెంచరీ చేయడం ఎప్పుడూ ప్రత్యేకమేనని రుతురాజ్ చెప్పాడు.
‘మీరు చెప్పిన గణాంకాల గురించి నాకు తెలియదు. కానీ సెంచరీ చేయడం ఆనందంగా ఉంది. ఇక్కడి పరిస్థితులు మేము స్వదేశంలో ఆడే పిచ్లతో పోలిస్తే పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. గాలి ప్రభావం కూడా ఎక్కువగా ఉంది. అందుకే క్రీజులో సెట్ అయిన బ్యాటర్ చివరి వరకు ఉండటం చాలా ముఖ్యం. ఈ రోజు ఆ బాధ్యతను నేను తీసుకున్నా. చాలా సంతోషంగా ఉంది. వీలైనంత ఎక్కువగా స్ట్రైక్ రొటేట్ చేయడానికే ప్రయత్నించాను. అప్పటికే మేము మూడు వికెట్లు కోల్పోయాం. అలాంటి సమయంలో కొత్త బ్యాటర్ వచ్చి మిడిల్ ఓవర్లలో ఇబ్బంది పడకూడదని భావించాం. అందుకే నేను, తిలక్ వర్మ కలిసి ఎక్కువసేపు బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాం’ అని రుతురాజ్ గైక్వాడ్ తెలిపాడు.
Also Read
- Joe Root: నాకు ఆడడం రాదా?.. 14 వేల పరుగులు ఎలా చేశాను.. విమర్శకులకు జో రూట్ గట్టి కౌంటర్!
- Babar Azam: బాబర్ అజామ్.. నీవల్ల జట్టుకు ఏం ఉపయోగం.. బాసిత్ అలీ ఫైర్!
- Kranti Goud: నెం.11 స్థానంలో బ్యాటింగ్కు వచ్చి చరిత్ర సృష్టించిన క్రాంతి గౌడ్..!
- Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
నాలుగో వికెట్కు కెప్టెన్ తిలక్ వర్మతో కలిసి 150 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పిన విషయాన్ని గుర్తుచేసుకున్న రుతురాజ్.. చివరి ఓవర్లలో వేగంగా పరుగులు సాధించగలమనే నమ్మకం తమకు ఉందని పేర్కొన్నాడు. ‘మేము ఎంత ఎక్కువసేపు బ్యాటింగ్ చేస్తే అంత మంచిదని భావించాం. డెత్ ఓవర్లలో వేగంగా పరుగులు చేయగల సామర్థ్యం మాకు ఉందని తెలుసు. కానీ శ్రీలంక బౌలర్లకు కూడా క్రెడిట్ ఇవ్వాలి. వారు చాలా కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. ఒక దశలో మేము 290 లేదా అంతకంటే ఎక్కువ స్కోరు చేస్తామని అనుకున్నాం. కానీ శ్రీలంక బౌలర్లు మమ్మల్ని అడ్డుకున్నారు. వారు చాలా బాగా బౌలింగ్ చేశారు’ అని అన్నాడు.
ఈ మ్యాచ్లో రుతురాజ్ గైక్వాడ్ 101 పరుగులతో మెరిసి భారత్-ఏ జట్టు 277 పరుగులు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. అనంతరం భారత బౌలర్లు సమిష్టిగా రాణించి శ్రీలంక-ఏను 269 పరుగులకు ఆలౌట్ చేయడంతో.. భారత్-ఏ 8 పరుగుల తేడాతో త్రిల్లింగ్ విక్టరీ సాధించింది.
తాజావార్తలు
-
Rythu Shankaravam: ‘రైతు శంఖారావం’కు అనుమతి నిరాకరణ.. ఎక్కడికక్కడే వైసీపీ నేతలను అడ్డుకుంటున్న పోలీసులు!
-
OTT Releases: ఈ వారం ఓటీటీ సినిమాలు… థ్రిల్లర్, కామెడీ, హారర్తో సరికొత్త లైనప్
-
Joe Root: నాకు ఆడడం రాదా?.. 14 వేల పరుగులు ఎలా చేశాను.. విమర్శకులకు జో రూట్ గట్టి కౌంటర్!
-
Lenskart Investorsకు గుడ్ న్యూస్.. షేర్లో 40% అప్సైడ్ ఉందంటున్న నోమురా!
-
Psychology Facts: ‘లైట్ తీసుకో, పట్టించుకోకు..’ ఈ మాటలతో నష్టమే ఎక్కువ!
ట్రెండింగ్
-
PM Modi: భారత్ ఆర్థిక దూకుడు.. తొలి త్రైమాసికంలో జీడీపీ 7.8%పెరుగుదల.. హర్షించిన ప్రధాని.!
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!