NTV Telugu Site icon

వన్డే కెప్టెన్సీ పై స్పందించిన రోహిత్….

విరాట్ కోహ్లీ నుండి భారత వన్డే జట్టు కెప్టెన్సీ బాధ్యతలు రోహిత్ శర్మ చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయం పై చాలా విమర్శలు వచ్చాయి. అయితే ఈ వన్డే కెప్టెన్సీ పై రోహిత్ వ్యాఖ్యలను బీసీసీఐ తాజాగా ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. మనం దేశం కోసం ఆడుతున్నప్పుడు ఒత్తిడి ఎప్పుడూ ఎక్కువగా ఉంటుంది. అదిమంచిగా ఉండచ్చు. లేదా చెడుగా ఉండచ్చు. కానీ ఒక క్రికెటర్‌ ఎప్పుడు తన ఆట పై దృష్టి పెట్టడం ముఖ్యం.

ఎందుకంటే… బయట జరుగుతున్న దానిని ఎవరు ఆపలేరు. ఆవిషయాన్ని నేను ఇప్పటికే చాలా సార్లు చెప్పను. ఇప్పుడు మళ్ళీ చెబుతున్నాను. కాబట్టి మన చేతిలో ఉన్న దాని పైన దృష్టి పెట్టడం చాలా ముఖ్యం.ఆ అలాగే మేము ఆటగాళ్ల మధ్య మంచి సంబంధాలు ఉంచడానికి చూడాలి. ఎందుకంటే బయట ఎవరు ఏం మాట్లాడుకునే పర్లేదు. కానీ జట్టులోని వారు ఏం మాట్లాడుకుంటున్నారు అనేది ముఖ్యం అని రోహిత్ చెప్పాడు.