RCB Sale Price: ఐపీఎల్ చరిత్రలో మరో సంచలన డీల్.. ఆర్సీబీ కొత్త ఓనర్స్ ఎవరంటే?
- ఐపీఎల్ చరిత్రలో మరో సంచలన డీల్
- రికార్డు ధరకు ఆర్సీబీ ఫ్రాంచైజీ విక్రయం
- ఆర్సీబీ కొత్త యుగం ప్రారంభం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RCB Sold for RS 16706 Crore in Record IPL Deal: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో మరో సంచలన డీల్ నమోదైంది. లీగ్లో అత్యంత ఆకర్షణీయ జట్లలో ఒకటైన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఫ్రాంచైజీ రికార్డు స్థాయిలో రూ.16,706 కోట్ల (సుమారు $1.78 బిలియన్)కు విక్రయించబడింది. ఈ భారీ డీల్తో ఐపీఎల్లో జట్ల విలువలు మరో స్థాయికి చేరుకున్నాయి. ఇప్పటివరకు డియాజియో ఆధీనంలో ఉన్న ఆర్సీబీ.. ఇప్పుడు కొత్త యజమానుల చేతుల్లోకి వెళ్లడం క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్గా మారింది.
ఆర్సీబీ ఫ్రాంచైజీని ఒక శక్తివంతమైన కన్సార్టియం సొంతం చేసుకుంది. ఇందులో ఆదిత్య బిర్లా గ్రూప్ కీలక పాత్ర పోషిస్తుండగా.. ఆ గ్రూప్కు చెందిన ఆర్యమన్ బిర్లా చైర్మన్గా బాధ్యతలు చేపట్టనున్నట్లు సమాచారం. అలాగే టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్కు చెందిన సత్యన్ గజ్వాని వైస్ చైర్మన్గా ఉండనున్నారు. ప్రపంచ ప్రఖ్యాత ప్రైవేట్ ఈక్విటీ దిగ్గజం బ్లాక్స్టోన్, అమెరికన్ ఇన్వెస్టర్ డేవిడ్ బ్లిట్జర్ నేతృత్వంలోని బోల్ట్ వెంచర్స్ కూడా ఈ కన్సార్టియంలో భాగస్వాములుగా ఉన్నారు. ఆర్సీబీ పురుష, మహిళల జట్టును కూడా కలిపే ఈ నాలుగు సంస్థల కన్సార్షియం సొంతం చేసుకుంది.
Also Read
- Team India Player: ‘పిక్నిక్లా భావించి వెళ్లారు.. ఐర్లాండ్ దెబ్బకు బొక్కబోర్లా పడ్డారు’..
- Ashwin: ‘మీరు తప్పు చేశారు’.. వాషింగ్టన్ సుందర్ పాత్రపై అశ్విన్ వ్యాఖ్యలు..
- Tilak Varma: వైస్ కెప్టెన్ అయితే స్థానం పదిలం అనుకుంటున్నావా..? తిలక్ వర్మపై ఘాటు వ్యాఖ్యలు..
- Shivam Dube: శివమ్ దూబేకు సరైన గుర్తింపు రాలేదా?.. సోషల్ మీడియాలో వైరల్గా స్టాట్స్!
ఈ భారీ ఒప్పందం ఐపీఎల్లో ఫ్రాంచైజీల విలువ ఎంత వేగంగా పెరుగుతోందో మరోసారి నిరూపితమైంది. గత కొన్నేళ్లుగా ఐపీఎల్ గ్లోబల్ స్పోర్ట్స్ లీగ్లలో అత్యంత విలువైన టోర్నమెంట్గా ఎదిగిన నేపథ్యంలో ఇలాంటి డీల్స్ సహజంగానే మారాయి. ఆర్సీబీకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారీ ఫ్యాన్బేస్, బ్రాండ్ విలువ ఈ డీల్ను మరింత ప్రత్యేకంగా నిలిపాయి. కొత్త యాజమాన్యం రాకతో ఆర్సీబీ జట్టులో వ్యూహాత్మక మార్పులు, కొత్త పెట్టుబడులు, మెరుగైన మౌలిక వసతులు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే స్టార్ ప్లేయర్లు, భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన ఆర్సీబీ.. కొత్త యుగంలో మరింత బలంగా మారే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.
2008లో ఐపీఎల్ ప్రారంభం అయినపుడు ఆర్సీబీ ఫ్రాంఛైజీ విలువ రూ.500 కోట్లు. అప్పట్లో అత్యధిక ధర పలికిన రెండో ఫ్రాంఛైజీగా నిలిచింది. లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా ముందుగా ఆర్సీబీని కోలుగోలు చేయగా.. ఆ తర్వాత ఆర్థిక వివాదాల్లో చిక్కుకుని దేశం విడిచి పారిపోయాడు. మాల్యా భాగస్వామిగా ఉన్న యుఎస్ఎల్ సంస్థ.. ఆర్సీబీ ఫ్రాంఛైజీని ఇన్నేళ్లు నడిపించింది. 18 ఏళ్ల ఐపీఎల్ టైటిల్ నిరీక్షణకు గతేడాదే ఆర్సీబీ తెరదించింది. ఐపీఎల్ 2026 అనంతరం ఆర్సీబీ కొత్త యాజమాన్యం చేతుల్లోకి వెళ్లనుంది. ఇప్పటికే ప్రముఖ టెక్ వ్యాపారవేత్త కల్ సోమని నేతృత్వంలోని కన్సార్షియం రూ.15,300 కోట్లకు రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంఛైజీని కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
CM Chandrababu : చిన్నారులే భవిష్యత్ సంపద.. ఉమ్మడి కుటుంబాలపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Team India Player: ‘పిక్నిక్లా భావించి వెళ్లారు.. ఐర్లాండ్ దెబ్బకు బొక్కబోర్లా పడ్డారు’..
-
Ashwin: ‘మీరు తప్పు చేశారు’.. వాషింగ్టన్ సుందర్ పాత్రపై అశ్విన్ వ్యాఖ్యలు..
-
Sharmistha Mukherjee: “రాజకీయం పార్ట్ టైమ్ కాదు”.. రాహుల్ గాంధీపై ప్రణబ్ కుమర్తె ఘాటు విమర్శలు..
-
Srinivasa Mangapuram: ఘట్టమనేని ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్.. జూలై రేస్ నుంచి తప్పుకున్న జయకృష్ణ ‘శ్రీనివాసమంగాపురం’?
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!