Pathum Nissanka Joins T20 Worldcup Centuries List: టీ20 ప్రపంచకప్లో శతకం సాధించడం అంటే ఓ ప్రత్యేక ఘనత. పొట్టి ఫార్మాట్లో బ్యాటర్లు దూకుడుగా ఆడినా.. సెంచరీ చేయడం చాలా కష్టం. ఏ క్షణంలో అయినా అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే సెంచరీ చేస్తే మాత్రం అత్యంత అరుదైన విషయం అవుతుంది. ప్రస్తుతం టీ20 ప్రపంచకప్ 2026 జరుగుతోంది. ఇప్పటివరకు కొందరు మాత్రమే శతకాలు చేశారు. 2007 నుంచి ఇప్పటివరకు జరిగిన ఎడిషన్లలో కొద్ది మంది మాత్రమే ఈ ఘనత సాధించి.. తమ పేరును రికార్డుల్లో నిలిపారు. ఆ జాబితాను ఓసారి చూద్దాం.
2026 ఎడిషన్లో శ్రీలంక బ్యాటర్ పాతుమ్ నిశాంక ఆస్ట్రేలియాపై అజేయంగా 100 పరుగులు చేసి సంచలనం సృష్టించాడు. ఈ సెంచరీతో నిశాంక ప్రపంచకప్లో శతకం చేసిన రెండో లంక బ్యాటర్గా నిలిచాడు. ఇంతకుముందు దిగ్గజ బ్యాటర్ మహేళ జయవర్ధనే సెంచరీ (100) చేశాడు. 2010లో మహేళ జింబాబ్వేపై శతకం (100) చేశాడు. 2022 టోర్నీలో కివీస్ ప్లేయర్ గ్లెన్ ఫిలిప్స్ శ్రీలంకపై 104 పరుగులు, దక్షిణాఫ్రికా బ్యాటర్ రిలీ రోసోవ్ బంగ్లాదేశ్పై 109 పరుగులతో మెరిశారు. 2021లో ఇంగ్లండ్ బ్యాటర్ జోస్ బట్లర్ శ్రీలంకపై అజేయంగా 101 పరుగులు చేశాడు.
2016లో యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ ఇంగ్లండ్పై సెంచరీ (100) చేయగా.. ఒమన్పై బంగ్లా ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ 103 పరుగులతో ఆకట్టుకున్నాడు. 2014 ఎడిషన్లో పాకిస్తాన్ ఆటగాడు అహ్మద్ షెహజాద్ బంగ్లాదేశ్పై శతకం (111 నాటౌట్) బాదగా.. ఇంగ్లండ్ ఆటగాడు అలెక్స్ హేల్స్ శ్రీలంకపై సెంచరీ (116 నాటౌట్) చేశాడు. 2012లో కివీస్ మాజీ ఓపెనర్ బ్రెండన్ మెకల్లమ్ బంగ్లాదేశ్పై 123 పరుగులతో రెచ్చిపోయాడు. టీ20 ప్రపంచకప్ టోర్నీ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోర్ ఇదే.
Also Read: Sri Lanka-T20 World Cup: టీ20 ప్రపంచకప్లో శ్రీలంక ప్రయాణం.. లంకేయులు ఎప్పుడూ పోటీదారులే!
2010లో మహేళ జయవర్ధనే జింబాబ్వేపై సెంచరీ (100) చేయగా.. టీమిండియా మాజీ బ్యాటర్ సురేష్ రైనా దక్షిణాఫ్రికాపై (101) సెంచరీ చేశాడు. ఇక తొలి ఎడిషన్ 2007లోనే క్రిస్ గేల్ దక్షిణాఫ్రికాపై 117 పరుగులు చేసి.. టీ20 ప్రపంచకప్ తొలి సెంచరీ హీరోగా నిలిచాడు. ఈ జాబితా చూస్తే.. టీ20 ఫార్మాట్ ఎంత వేగవంతమైనదైనా, పెద్ద ఇన్నింగ్స్ ఆడే ఆటగాళ్లు ఎప్పటికీ ప్రత్యేకంగా గుర్తింపు పొందుతారనే విషయం స్పష్టమవుతోంది. తాజా ఎడిషన్లో నిస్సాంక ప్రదర్శనతో మరోసారి ఈ లిస్ట్ చర్చనీయాంశమైంది.
