NTV Telugu Site icon

హాట్‌స్టార్… ఒకేసారి కోటి మంది లైవ్ చూశారు

టీ20 ప్రపంచకప్‌లో ఆదివారం హై ఓల్టేజ్ మ్యాచ్ జరుగుతోంది. భారత్-పాకిస్తాన్ మ్యాచ్ సందర్భంగా క్రికెట్ అభిమానులందరూ టీవీలకు అతుక్కుపోయారు. మరోవైపు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో 10 మిలియన్ల (1 కోటి) మందికి పైగా ఒకేసారి లైవ్ మ్యాచ్ చూస్తున్నారు. ఈ ఏడాదిలో హాట్ స్టార్ సంస్థ 10 మిలియన్ల మార్క్ అందుకోవడం ఇదే తొలిసారి. ఈ సంఖ్య ఇప్పుడు ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది. కాగా 2019 ప్రపంచకప్‌లో భారత్-న్యూజిలాండ్ సెమీస్‌ మ్యాచ్‌ను 25.3 మిలియన్ల మంది లైవ్ చూశారు. అంటే 2.5 కోట్ల మందికి పైగా లైవ్ చూశారన్న మాట. ఇదే ఇప్పటివరకు ఆల్‌టైమ్ రికార్డుగా నమోదై ఉండటం గమనార్హం.

Read Also: అఫ్రిది రికార్డును బద్దలు కొట్టిన షకీబ్