Ambati Rayudu: అంబటి రాయుడు కుటుంబానికి అత్యాచారం, హత్య బెదిరింపులు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Death threats to Ambati Rayudu’s family From Virat Kohli Fans: టీమిండియా మాజీ క్రికెటర్, తెలుగు ఆటగాడు అంబటి రాయుడు కుటుంబానికి అత్యాచారం, హత్య బెదిరింపులు వచ్చాయి. ఈ విషయాన్ని రాయుడు స్నేహితుడు సామ్ పాల్ తెలిపారు. కొందరైతే రాయుడు కుటుంబ సభ్యులను చంపేస్తామని, అతడి కూతుళ్లను అత్యాచారం చేస్తామని కామెంట్స్ చేశారని అయన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ బెదిరింపులతో రాయుడి కుటుంబం తీవ్ర భయాందోళనకు గురువుతుందని, బెదిరింపులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను సామ్ పాల్ కోరారు. అయితే ఈ వ్యవహారంపై తెలుగు తేజం రాయుడు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
ఐపీఎల్ 2024 సందర్భంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు, ఆ టీమ్ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై అంబటి రాయుడు పదే పదే విమర్శలు చేశాడు. ఆరెంజ్ క్యాప్ ఐపీఎల్ టైటిల్ను గెలిపించలేదని కోహ్లీపై రాయుడు సెటైర్ వేశాడు. ప్లే ఆఫ్స్ చేరితేనే.. టైటిల్ గెలిచినంతగా బెంగళూరు ఆటగాళ్లు సంబరాలు చేసుకుంటున్నారని మరోసారి విమర్శించాడు. కోహ్లీ, బెంగళూరు జట్టుని టార్గెట్ చేస్తూ మాట్లాడటంతో.. రాయుడిపై ఆర్సీబీ ఫాన్స్ ట్రోలింగ్కు దిగారు. కొందరు రాయుడిని బండ బూతులు తిట్టారు. రాయుడు కుటుంబ సభ్యులను చంపేస్తామని, అతడి కూతుళ్లను అత్యాచారం చేస్తామని దారుణంగా కామెంట్స్ చేశారు. ఈ బెదిరింపులపై రాయుడు స్నేహితుడు సామ్ పాల్ ఇన్స్టాగ్రామ్లో ఓ పోస్ట్ పెట్టారు.
Also Read
- IPL 2027: కోహ్లీ, రోహిత్తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
- రూ.2 లక్షల కోట్లకు చేరువలో IPL.. బ్రాండ్ విలువలో నెం.1గా RCB..
- Hardik Pandya: ఐపీఎల్ ట్రేడ్ హీట్.. హార్దిక్ పాండ్యా ఢిల్లీకా? చెన్నైకా? భారత మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
Also Read: Gold Price Today: మగువలకు శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం ధరలు!
‘ఈ రోజు నేను, నా స్నేహితుడు అంబటి రాయుడు కుటుంబ సభ్యులం డిన్నర్ కోసం బయటకు వెళ్ళాం. రాయుడు ఐపీఎల్ 2024 కోసం స్టార్ స్పోర్ట్స్లో వ్యాఖ్యాతగా చేశాడు. ఇటీవల ఓ జట్టు గురించి మాట్లాడుతూ కప్ ఎందుకు కొట్టలేదో తేడా వివరించాడు. రాయుడి చేసిన కామెంట్స్ను విరాట్ కోహ్లీ ఫాన్స్, క్రిమినల్స్, పీఆర్ ఏజెన్సీలు వ్యక్తిగతంగా తీసుకొని.. బెదిరింపులకు పాల్పడుతున్నారు. నేను, రాయుడు వీటిని చూసి నవ్వుకున్నాం. ఏడాది, నాలుగేళ్ల వయసున్న కూతుళ్లను హత్యాచారం చేస్తామని బెదిరిస్తున్నారని రాయుడి సతీమణి విద్య నాతో తెలిపింది. దారుణమైన ట్రోలింగ్తో వారిని తీవ్రంగా హింసిస్తున్నారు. మాట్లాడే హక్కు అందరికీ ఉంటుంది. బెదిరింపులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నా’ అని సామ్ పాల్ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!