Site icon NTV Telugu

MI vs RCB: రాణించిన దినేష్ కార్తీక్, డుప్లెసిస్.. ముంబై టార్గెట్ ఎంతంటే..?

Rcb

Rcb

ఐపీఎల్ 2024లో భాగంగా.. ముంబై ఇండియన్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు భారీ స్కోరు చేసింది. ముంబై ముందు 197 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసింది. కాగా.. ఈ మ్యాచ్ లో కెప్టెన్ డుప్లెసిస్ (61), చివరలో దినేష్ కార్తీక్ (53), రజత్ పాటీదార్ (50) పరుగులతో రాణించడంతో బెంగళూరు భారీ స్కోరు చేసింది. ఈ మ్యాచ్ లో ఓపెనర్లుగా బరిలోకి దిగిన కోహ్లీ (3) పరుగులు చేసి ఔటయ్యాడు. మరో ఓపెనర్ డుప్లెసిస్ ఈ మ్యాచ్ లో రాణించాడు. ఆ తర్వాత విల్ జాక్స్ (8) పరుగులు చేశాడు.

Hyper Adhi: ఆ తర్వాతనే నేను మళ్లీ షూటింగ్స్ మొదలెడతా.. హైపర్ ఆది..!

రజత్ పాటీదార్ (50) పరుగులతో రాణించాడు. కాగా.. మ్యాక్స్ వెల్ డకౌట్ అయి ఈ మ్యాచ్ లో కూడా నిరాశపరిచాడు. మహిపాల్ లోమ్రోర్ కూడా డకౌట్ అయ్యాడు. సౌరవ్ చౌహన్ (9) పరుగులు చేశాడు. ముంబై బౌలింగ్ లో జస్ప్రీత్ బుమ్రా 5 వికెట్లతో చెలరేగాడు. కోయోట్జీ, మద్వాల్, శ్రేయాస్ గోపాల్ తలో వికెట్ తీశారు.

Bandi Sanjay : కొండగట్టు అంజన్న సాక్షిగా అబద్దాలు చెబుతారా?

Exit mobile version