ఐపీఎల్ 2026లో మరో చారిత్రాత్మక ఘటన చోటుచేసుకుంది. సాధారణంగా ‘ఆరెంజ్ క్యాప్’ (టోర్నీలో అత్యధిక పరుగుల వీరుడు) ఓ ఆటగాడి వద్ద ఎక్కువ సమయం ఉండటం మనం చూస్తుంటాం. కనీసం ఓ రోజైనా ప్లేయర్ వద్ద ఉంటుంది. కానీ ఐపీఎల్ 2026లో మాత్రం ఒకే రోజులో నలుగురు ఆటగాళ్లు ఆరెంజ్ క్యాప్ను సొంతం చేసుకోవడం విశేషం. ఇది ఐపీఎల్ చరిత్రలో తొలిసారి జరగడంతో అభిమానులను ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఆ డీటెయిల్స్ ఏంటో ఓసారి చూద్దాం.
ఐపీఎల్ 2026లో భాగంగా శనివారం రెండు మ్యాచ్లు జరిగాయి. మధ్యాహ్నం ఢిల్లీ క్యాపిటల్స్ vs పంజాబ్ కింగ్స్ మ్యాచ్ జరగగా.. రాత్రి రాజస్థాన్ రాయల్స్ vs సన్రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడ్డాయి. ఈ రెండు మ్యాచ్లలో స్టార్ పరుగుల వరద పారించడంతో ఆరెంజ్ క్యాప్ చేతులు మారింది. ఉదయం సమయంలో విరాట్ కోహ్లీ వద్ద ఆరెంజ్ క్యాప్ ఉంది.మధ్యాహ్నానికి వచ్చేసరికి కేఎల్ రాహుల్ (152) భారీ ఇన్నింగ్స్తో ఆరెంజ్ క్యాప్ను దక్కించుకున్నాడు.
సాయంత్రం మ్యాచ్లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అద్భుత సెంచరీతో (103) అందరి దృష్టిని ఆకర్షించాడు. అతని దూకుడైన బ్యాటింగ్తో ఆరెంజ్ క్యాప్ మళ్లీ చేతులు మారింది. కేఎల్ రాహుల్ నుంచి వైభవ్ అందుకున్నాడు. ఇక అభిషేక్ శర్మ (57) తన అద్భుత ప్రదర్శనతో మరోసారి ఆరెంజ్ క్యాప్ను సొంతం చేసుకున్నాడు. వైభవ్ నుంచి అభిషేక్ ఆరెంజ్ క్యాప్ కైవసం చేసుకున్నాడు. ఒకే రోజులో ఇలా నాలుగు సార్లు ఆరెంజ్ క్యాప్ మారడం ఐపీఎల్ చరిత్రలో అరుదైన సంఘటనగా మారింది. ఇది ఈ సీజన్లో బ్యాట్స్మెన్ మధ్య ఉన్న తీవ్రమైన పోటీని స్పష్టంగా చూపిస్తోంది. ప్రతి మ్యాచ్లో పరుగుల వర్షం కురుస్తుండటంతో.. ఆరెంజ్ క్యాప్ పోటీ మరింత ఆసక్తికరంగా మారింది.
