IPL 2026 Final: చిన్నస్వామి నుంచి ఐపీఎల్ ఫైనల్ తరలింపు.. షాకింగ్ విషయం చెప్పిన బీసీసీఐ!
- ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్, ఫైనల్ షెడ్యూల్ తాజాగా విడుదల
- అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్
- బెంగళూరులో జరగాల్సి ఉన్నప్పటికీ అహ్మదాబాద్కు ఫైనల్
- షాకింగ్ విషయం చెప్పిన బీసీసీఐ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్, ఫైనల్ మ్యాచ్ షెడ్యూల్ను బీసీసీఐ తాజాగా విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్లేఆఫ్ మ్యాచ్లు ధర్మశాల, చండీగఢ్లలో జరగనుండగా.. ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనుంది. ఐపీఎల్ ఆనవాయితీ ప్రకారం.. ఫైనల్ బెంగళూరులో జరగాల్సి ఉన్నప్పటికీ.. కొన్ని కారణాల వల్ల వేదికను అహ్మదాబాద్కు మార్చారు. దీనిపై కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘం (కేఎస్సీఏ) అసంతృప్తి వ్యక్తం చేసింది. ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్ వేదికగా బెంగళూరును కాదని అహ్మదాబాద్ను ఎంపిక చేయడం వెనుక ఉన్న అసలు కారణాలను బీసీసీఐ తాజాగా వెల్లడించింది. ప్రధానంగా టికెట్ల కేటాయింపులో వివాదాలు, స్టేడియం సామర్థ్యం వంటి అంశాలే ఇందుకు కారణమని బోర్డు తెలిపింది.
ఐపీఎల్ నిబంధనల ప్రకారం.. ఆతిథ్య రాష్ట్ర క్రికెట్ సంఘానికి స్టేడియం మొత్తం సామర్థ్యంలో కేవలం 15 శాతం టికెట్లను మాత్రమే ఉచితంగా (కాంప్లిమెంటరీ) కేటాయిస్తారు. అయితే కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘం (కేఎస్సీఏ) భారీ మొత్తంలో టికెట్స్ అడిగిందని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా తెలిపారు. ‘లీగ్ మ్యాచ్ల సమయంలోనే కేఎస్సీఏ నిర్ణీత కోటా కంటే ఎక్కువ టికెట్లు డిమాండ్ చేసింది. దీనిపై వివరణ కోరుతూ బీసీసీఐ పంపిన ఈమెయిల్కు కేఎస్సీఏ బదులిచ్చింది. తమ సభ్యులు, అనుబంధ క్లబ్లతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కూడా భారీగా ఉచిత టికెట్లు కావాలని కేఎస్సీఏ తెలిపింది. అంతేకాకుండా కర్ణాటక ప్రభుత్వానికి మరో 700 టికెట్లు అదనంగా ఇవ్వాలని పట్టుబట్టింది. నిబంధనల కంటే దాదాపు 10,000 టికెట్లు అదనంగా అడగడం బీసీసీఐని షాక్కు గురిచేసింది. ఈ మొండి వైఖరి వల్లే బెంగళూరు రేసు నుంచి తప్పుకోవాల్సి వచ్చింది’ అని దేవజిత్ సైకియా వివరించారు.
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్కు చేర్చిన క్షణాలు..
గత ఏడాది విజేత జట్టు హోమ్ గ్రౌండ్లో ఫైనల్ నిర్వహించడం ఆనవాయితీ అయినప్పటికీ.. ఈసారి ఆ ఛాన్స్ బెంగళూరుకు దక్కలేదు. దీనిపై ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధూమల్ స్పందిస్తూ.. ఫైనల్ వేదిక మారడానికి స్టేడియం సామర్థ్యం కూడా కీలక పాత్ర పోషించిందని వివరించారు. ‘బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం సామర్థ్యం కేవలం 40,000 మాత్రమే. కానీ అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం ప్రపంచంలోనే అతిపెద్దది. ఇక్కడ 1.30 లక్షల మంది కూర్చునే వసతి ఉంది. ఫైనల్ సమయంలో ఐసీసీ సమావేశం జరగనుంది. విదేశీ ప్రతినిధులు, ప్రముఖులకు తగినన్ని టికెట్లు, సౌకర్యాలు కల్పించాలంటే అహ్మదాబాద్ సరైన వేదిక అని బోర్డు భావించింది. ఐపీఎల్ ఫైనల్ చూసేందుకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు వస్తారు. ఎక్కువ మందికి అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో పెద్ద స్టేడియం వైపు మొగ్గు చూపాం’ అని అరుణ్ ధూమల్ చెప్పారు.
తాజావార్తలు
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
Survival Thriller: గుహల్లో చిక్కుకున్న స్నేహితులు.. ప్రాణాలు తీసే రహస్య జీవి… వణికించబోతున్న సర్వైవల్ థ్రిల్లర్
-
Kannada Villains : తెలుగు సినిమాల్లో బలమైన విలన్లుగా ముద్ర వేస్తున్నారు కన్నడ నటులు
-
Mudragada Funeral: ముద్రగడకు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు!
-
Hyderabad: దారుణం.. 7వ తరగతి విద్యార్థినిపై అత్యాచారం.! నిందితుడు అరెస్ట్..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!
-
7 అంగుళాల OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, AI యాంటీ-ఫ్రాడ్ ఫీచర్లతో REDMI Note 17 లాంచ్..!
-
Shubman Gill: ఆ ఇద్దరి వల్లే గెలిచాం.. లేదంటే మరో ఓటమే.. గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!