ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 264 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ 152 పరుగులతో నాటౌట్గా నిలవగా, నితీష్ రాణా కూడా 91 పరుగులు చేశాడు. అయితే 265 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన పంజాబ్ బ్యాటింగ్ను ప్రారంభించింది. పంజాబ్ ఓపెనర్లు ప్రభ్సిమ్రన్ సింగ్, ప్రియాన్ష్ ఆర్య క్రీజ్లో ఉన్నారు. ఈ మ్యాచ్ కొనసాగుతున్న వేళ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది.
ఢిల్లీ, పంజాబ్ మ్యాచ్లో బౌలర్ లుంగి ఎంగిడి తీవ్రంగా గాయపడ్డాడు. ప్రభ్ సిమ్రాన్ కొట్టిన బంతిని క్యాచ్ పట్టబోయి కిందపడ్డాడు ఢిల్లీ ప్లేయర్ ఎంగిడి. బాడీవెయిట్ మొత్తం మెడ మీద పడటంతో తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో ఆటగాళ్లతో పాటు అంతా షాక్ కు గురయ్యారు. తీవ్రమైన గాయం కారణంగా లుంగి ఎంగిడిని స్ట్రెచర్పై మైదానం నుండి బయటకు తీసుకెళ్లారు. ఎంగిడిని అంబులెన్స్లో ఆస్పత్రికి తరలించారు.
